E-Paper
Advertisement

పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న వైరల్ లేఖ.. ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ నిజమేనా?

పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న వైరల్ లేఖ.. ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ నిజమేనా?
Advertisement

Balochistan: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక లేఖ సంచలనం సృష్టిస్తోంది. ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ పేరుతో వైరల్ అవుతున్న ఆ లేఖ.. పాకిస్థాన్ ముక్కలైందని, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించిందని పేర్కొనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, నిజంగానే పాక్ ముక్కలైందా? బలూచిస్తాన్ విడిపోయిందా?

వైరల్ లేఖ వెనుక అసలు నిజం

Advertisement

వైరల్ అవుతున్న లేఖలో బలూచ్ తిరుగుబాటుదారులు 85 శాతం భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని, సొంత జెండా, జాతీయ గీతాన్ని ప్రకటించుకున్నారని ఉంది. కానీ అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి గానీ, ఏ ఇతర దేశం గానీ బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. అధికారికంగా పాకిస్థాన్ ముక్కలు కాలేదు. కానీ, ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వెనుక దశాబ్దాలుగా నలుగుతున్న బలూచ్ ప్రజల ఆక్రందన, ఆకలి, తిరుగుబాటు దాగి ఉన్నాయి.

Also Read: సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

Advertisement

బలూచిస్తాన్‌లో ఏం జరుగుతోంది?

భౌగోళికంగా బలూచిస్తాన్ సహజ వనరులు, బంగారు గనులతో విలసిల్లే సంపన్న భూమి. కానీ, అక్కడి సంపదను పాక్ పాలకులు దోచుకుంటూ, స్థానిక ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెట్టేస్తున్నారు. దీనికి తోడు చైనా నిర్మిస్తున్న సీపెక్ ప్రాజెక్టుల వల్ల బలూచ్ ప్రజలు తమ స్వంత నేలపైనే పరాయివాళ్లుగా మారుతున్నారు. ఈ అణిచివేత, నరమేధానికి వ్యతిరేకంగానే ‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ వంటి సాయుధ సంస్థలు కొన్నేళ్లుగా పాక్ సైన్యంపై గెరిల్లా దాడులు చేస్తున్నాయి.

పాక్ వక్రబుద్ధి.. భారత్ స్పందన

ఎప్పటిలాగే తన దేశంలోని అంతర్గత విఫలతను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్థాన్ కుక్క తోక వంకర సామెతను నిజం చేస్తోంది. బలూచిస్తాన్ తిరుగుబాటు వెనుక భారత నిఘా సంస్థ ‘రా’ హస్తం ఉందంటూ పాత పల్లవినే అందుకుంది. దీనిపై భారత్ ఎప్పుడో తన పంథాను స్పష్టం చేసింది. బలూచిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. అక్కడ జరుగుతున్న అంతర్గత తిరుగుబాట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. పాక్ తన తప్పులను ఇతరులపై నెట్టేయడం మానుకోవాలని స్పష్టం చేసింది.

Also Read: తెలంగాణ టూరిజంపై ఎల్ నినో దెబ్బ.. జూలై నెలలోనూ ఎండిపోయిన జలపాతాలు

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×