E-Paper
Advertisement

Land Slide in Goldmine: విరిగిపడిన కొండచరియలు.. 54 మంది మృతి

Land Slide in Goldmine: విరిగిపడిన కొండచరియలు.. 54 మంది మృతి
Advertisement

Land Slide in Philippines Goldmine: కొండచరియలు విరిగిపడి 54 మంది మృతి చెందిన ఘటన పిలిప్పీన్స్ లో జరిగింది. పిలిప్పీన్స్ లోని డావో ప్రావిన్సు మాకో టౌన్ లో బంగారు గని సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటంతో.. ఇళ్లు, వాహనాలు వాటికింద కూరుకుపోయాయి. గతవారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగితోంది.

Read More: మరో సంచలన దౌత్య విజయం.. మరణశిక్ష రద్దైన ఏడుగురు స్వదేశానికి..

Advertisement

ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతున్నట్లు డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 300 మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపడుతున్నా.. భారీ వర్షాలు, బురద కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోందని పేర్కొంది. మళ్లీ కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో.. సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందని తెలిపింది. ఈ ప్రమాదంలో మరో 63 మంది ఆచూకీ ఇంతవరకూ తెలియలేదని, వారిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×