E-Paper
Advertisement

USA: బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించిన అమెరికా

USA: బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించిన అమెరికా
Advertisement

USA: ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదమవుతోంది. గుజరాత్ అల్లర్లపై ఇండియా.. ది మోదీ క్వశ్చన్ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంటరీని ఇప్పటికే భారత ప్రభుత్వం ఖండించింది. ఆ డాక్యుమెంటరీలో దుష్ప్రచారం ఎక్కువగా ఉందని, చూసే వారిని తప్పుదోవ పట్టించేలా ఉందని పలువురు ఆరోపించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా దీనిపై స్పందిస్తూ.. అందులోని అంశాలను తాను పూర్తిగా అంగీకరించలేనని తెలిపారు.

ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందించారు. ‘‘ఈ డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. భారత ప్రజాస్వామ్యం అత్యంత శక్తివంతమైనది. రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్‌కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు. ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై మా దృష్టి ఉంటుంది. ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి’’ అని అన్నారు.

Advertisement

ఇటీవల దీనిపై స్పందించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక ప్రచార కార్యక్రమం అని, వారు ఎంచుకున్న కోణాన్ని మాత్రమే ప్రచారం చేయడానికి దీన్ని రూపొందించారని అన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్య్ర దర్యాప్తు చేయాలంటూ యూకేలో ఆన్‌లైన్ పిటిషన్ కూడా దాఖలైంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×