E-Paper
Advertisement

America : డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేసిన నర్సు.. ఆసుపత్రిలో 10 మంది మృతి..

America : డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేసిన నర్సు.. ఆసుపత్రిలో 10 మంది మృతి..
Advertisement

America : ఓ నర్స్ చేసిన పని వల్ల పది మంది అమాయక రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషాద ఘటన అమెరికాలో జరిగింది. యూఎస్ ఒరెగాన్‌లోని ఓ ఆసుపత్రిలో నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగిలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ ను ఇంజెక్ట్ చేసింది. దీంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆసుపత్రిలో ఇచ్చే మందులు చోరీకి గురి కావడంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. డిసెంబర్ ప్రారంభంలో ఓ మాజీ ఉద్యోగి మందులను దొంగిలించారని పోలీసులు అధికారులను అలర్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

హాస్పటల్ లో పేషెంట్స్ కు ఇచ్చే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ నర్సు దొంగతనం చేసి దాన్ని కప్పి పుచ్చేందుకు రోగులకు డ్రిప్ వాటర్ ని ఇంజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఈ ఆసుపత్రిలో మృతి చెందిన వ్యక్తుల మరణాలు ఇన్‌ఫెక్షన్ కారణంగానే జరిగాయని ఆస్పత్రి అధికారులు తమతో చెప్పారని మృతుల కుటుంబ సభ్యులు అంటున్నారు.ఈ మరణాలు మెడిసిన్ చోరీ వల్ల జరిగిందా లేక ట్యాంపరింగ్ వల్ల జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×