E-Paper
Advertisement

UPI Lite Wallet: ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ ట్రాన్స్‌ఫర్!

UPI Lite Wallet: ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ ట్రాన్స్‌ఫర్!
Advertisement

UPI Lite Wallet: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న, చిన్న లావాదేవీలు చేసే డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లైట్‌ను ఈ-మాండేట్ కిందకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ విధానంతో యూపీఐ లైట్‌లో ఆటోమెటిక్‌గా క్యాష్ లోడ్ చేసుకునే ఫీచర్‌ను ప్రతిపాదించింది. ఈ విధానంతో లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఫాస్టాగ్‌కు కూడా ఇదే విధానాన్ని ఆర్‌బీఐ సూచించింది.

చెల్లింపులు పెరగనున్నాయా..?

Advertisement

యూపీఐ లైట్ ఓ వ్యాలెట్‌లా పనిచేస్తుంది. ఈ విధానంతో చేసే చెల్లింపులకు పిన్ నంబర్ అవసరం ఉండదు. దీంతో చెల్లింపులు పెరగనున్నాయి. ఇందులో గరిష్టంగా రూ.2వేల వరకు లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కరోజులో రూ.2వేలు మాత్రమే లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఒక్క రోజు కూడా గరిష్టంగా రూ.500 మాత్రమే పేమెంట్ చేసేందుకు వీలు ఉండనుంది. యూపీఐకి చెందిన సులభతరమైన వెర్షన్.. ఈ యూపీఐ లైట్. యూపీఐ విధానాన్ని మరింత సౌలభ్యంగా మారుస్తూ యూపీఐ లైట్ వెర్షన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

వ్యాలెట్‌లో బ్యాలెన్స్

Advertisement

ఆర్‌బీఐ తీసుకొస్తున్న ఈ-మాండేట్ విధానంతో యూపీఐ లైట్ మరింత సులభంగా, సౌకర్యవంతంగా పనిచేయనుంది. దీంతో వినయోగం సైతం పెరిగే అవకాశం ఉండనుంది. ఈ-మాండేట్ విధానం కిందకొస్తే.. యూపీఐ వ్యాలెట్‌లో బ్యాలెన్స్ ఎప్పటికీ తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే బ్యాలెన్స్ తగ్గిన వెంటనే.. ఈ-మాండేట్ విధానంతో ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ లోడ్ అవుతోంది. ఇలా అనుకోకుండా యూజర్స్ క్యాష్ లోడ్ చేయడం మరిచిపోయిన సమయంలో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా క్యాష్ లోడ్ కానుంది. అయితే లిమిట్ విషయంలో యూజర్స్‌ నిర్ణయంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంతో బ్యాలెన్స్ తగ్గే అవకాశం ఉండదు.

Also Read: నో ఛేంజ్.. ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథం

ప్రయాణికులకు బెస్ట్ ఆప్షన్

యూపీఐ లైట్.. ఈ-మాండేట్ విధానంతో యూజర్స్ ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా డిజిటల్ లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో ఫాస్టాగ్‌తోపాటు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వంటి వాటిని ఈ-మాండేట్ విధానంలోకి తీసుకొస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. ఫాస్టాగ్ కార్డులో వ్యాలెట్ క్యాష్ తగ్గితే.. లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా వ్యాలెట్‌లోకి చేరుతుంది. దీంతో ప్రయాణ సమయాల్లో టోల్ గేట్ లావాదేవీల్లో నగదు ఇబ్బందుల సమస్య తలెత్తే అవకాశం ఉండదు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×