E-Paper
Advertisement

విజయ్ దెబ్బకి ‘సన్’ టీవీకి స్ట్రోక్… షేర్లు 10 శాతం పతనం

విజయ్ దెబ్బకి ‘సన్’ టీవీకి స్ట్రోక్… షేర్లు 10 శాతం పతనం
Advertisement

Sun TV Shares: సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏడీఎంకే, డీఎంకే పార్టీలను వెనక్కి నెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా దూసుకుపోతుంది. అయితే టీవీకే విజయం ఖరారు కావడంతో.. డీఎంకే ఓటమితో సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్ షేర్లు 9.5% పైగా పడిపోయాయి. ఆగస్టు 2024లో సన్ టీవీ షేర్లు 10% పైగా పడిపోయినప్పటి నుంచి, ఒక్కరోజులో ఇంత భారీగా పడిపోవడం ఇదే తొలిసారి. ఓ దశలో సన్‌టీవీ షేరు విలువ బీఎస్‌ఈలో 9.5 శాతం మేర పతనమై రూ.547.55 వద్ద కనిష్ట ధరను తాకింది. మార్కెట్‌ ముగిసే నాటికి 5.38 శాతం నష్టంతో రూ.573 వద్దకు చేరింది.

సన్ టీవీ షేర్లు పతనం

సన్ టీవీ నెట్‌వర్క్ మారన్ కుటుంబ యాజమాన్యంలో కొనసాగుతోంది. కలనిధి మారన్, దివంగత డీఎంకే అధినేత ఎం. కరుణానిధికి మనవడు. డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న గత ఐదేళ్లుగా, సన్ టీవీ షేర్లు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. 2023లో సన్ స్టాక్ 46% లాభపడగా, 2024 (4% పతనం), 2025 (14% పతనం), 2022 (3% పతనం)లలో నష్టాల్లోనే కొనసాగింది. 2021లో సన్ టీవీ స్టాక్ 4% లాభపడింది. హై ట్రేడింగ్ వాల్యూమ్‌ల మధ్య సన్ టీవీ షేర్లు భారీగా పడిపోతున్నాయి. 20 రోజుల్లో సగటున 87,000 షేర్లు, ఇప్పటికే 5.5 లక్షలకు పైగా షేర్లు చేతులు మారాయి.

లీడ్ లో టీవీకే

Advertisement

తాజా ట్రెండ్స్ ప్రకారం, విజయ్ టీవీకే 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 27 స్థానాల్లో విజయం సాధించింది. ఏడీఎంకే కూటమి 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 12 స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకే 59 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 14 స్థానాల్లో విజయం సాధించింది. సోమవారం సన్ టీవీ షేర్లు 8.7% తగ్గి రూ.551.2 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ స్టాక్ అన్ని కీలక మూవింగ్ యావరేజ్‌ల కంటే దిగువకు చేరింది. రూ.571 వద్ద 200 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే కూడా కిందకు పడిపోయింది.

Also read:   విజయ్ సక్సెస్ వెనుక.. త్రిష మాస్టర్ ప్లాన్ ఉందా? తమిళనాట ఆసక్తికర చర్చ!

లాభాల్లో సూచీలు

Advertisement

మరోవైపు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలు నమోదు చేశాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమై ఓ దశలో దాదాపు 1000 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ లాభపడింది. అనంతరం దాదాపు 700 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 12.50 గంటలకు 319 పాయింట్ల లాభంతో 77,269.40 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో 24,094 వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌,రిలయన్స్‌ స్టాక్స్‌ లాభాల్లో కొనసాగాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×