E-Paper
Advertisement

డేటా సిటీ విశాఖ‌కు మరో బూస్ట్.. రిలయన్స్ డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటు, దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడి

డేటా సిటీ విశాఖ‌కు మరో బూస్ట్.. రిలయన్స్ డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటు, దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడి
Advertisement

VIZAG: డేటా సిటీ నగరంగా రూపు దిద్దుకోనుంది విశాఖపట్నం. దీనికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. గూగుల్ తన ఏఐ డేటా సెంటర్‌కు పునాది రాయి వేసింది. తాజాగా రిలయన్స్ సంస్థ కూడా రంగంలోకి దిగేసింది. ఏకంగా కోటి 60 లక్షలతో డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఉత్తరాంధ్రకు సరైన బూస్ట్ లభించినట్లయ్యింది.

డేటా సిటీ విశాఖ‌కు మరో బూస్ట్

Advertisement

రిలయన్స్ సంస్థ దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌ను విశాఖలో ఏర్పాటు చేయనుంది. ఆ సంస్థ సుమారు రూ. 1.6 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో జోరందుకున్నాయి. 1.5 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మంది యువతీయువకులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు విశాఖలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్ కూడా లక్ష కోట్లకుపైగా పెట్టుబడులను పెడుతోంది కూడా. ఇప్పుడు ఆ జాబితాలోకి రిలయన్స్ సంస్థ కూడా చేరిపోయింది.

Advertisement

రిలయన్స్ డేటా సెంటర్ క్లస్టర్‌.. దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడి

డేటా సెంటర్ క్లస్టర్‌తోపాటు దానిని నిర్వహణ కోసం సోలార్ విద్యుత్ బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ నిర్మించనుంది రిలయన్స్. ఇప్పటికే గూగుల్ ఒక గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లను నిర్మిస్తోంది. రిలయన్స్‌ డేటా సెంటర్ క్లస్టర్ దానికంటే పెద్ది. సామర్థ్యం, పెట్టుబడుల్లో గూగుల్‌ను అధిగమించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

పెట్టుబడులకు గత శనివారం మీటింగ్‌లో రిలయన్స్ ఆమోదించినట్టు తెలుస్తోంది. గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను 3 దశల్లో నిర్మంచనుంది. అందుకోసం ఏపీ ప్రభుత్వం నుంచి దాదాపు 935 ఎకరాలు కోరిందని సమాచారం. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, డిశాలినేషన్ ప్లాంట్ వంటివి ఏర్పాటు చేయనుంది.

ALSO READ: డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్‌పై ఆధారపడవద్దు.. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే.. ఎందుకంటే?

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భూముల పరిశీలన మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. విశాఖలో 295 ఎకరాలు గుర్చించినట్టు తెలుస్తోంది. సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం శ్రీసత్యసాయి జిల్లాలో భూములు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. ఒకేచోట 600 ఎకరాలు కేటాయించాలని సంస్థ కోరినట్టు సమాచారం. మిగిలిన రెండు జిల్లాల్లో ఒకేచోట అందుబాటులో ఉన్న భూములను పరిశీలన చేస్తోందట ప్రభుత్వం. భూముల అంశం కొలిక్కి వచ్చిన తర్వాత పరిశీలనకు రిలయన్స్‌ ప్రతినిధులు రానున్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×