E-Paper
Advertisement

2 Thousand Note: మీ దగ్గర ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? ఈ వార్త మీకోసమే

2 Thousand Note: మీ దగ్గర ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? ఈ వార్త మీకోసమే
Advertisement

2వేల నోట్ల రూపాయలను భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితమే రద్దు చేసింది. ఎవరి దగ్గరైనా ఆ నోట్లు ఉంటే అప్పట్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాదాపుగా అందరూ డిపాజిట్ చేశారు. 98.35శాతం నోట్లు తిరిగి ఆర్బీఐకి చేరుకున్నాయి. మరి మిగతా నోట్ల సంగతేంటి? ఆ నోట్లను ఎవరు ఎందుకు తమ వద్ద పెట్టుకున్నారు. కారణాలేవైనా వాటిని తిరిగి ఆర్బీఐకి అప్పగించాలంటూ తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.

తిరిగి ఇచ్చేయండి..
2వేల రూపాయల నోట్లు చెలామణిలో లేవు. అంటే వాటిని ఉపయోగించి మనం ఏ వస్తువుని కొనలేం, అలాగని నేరుగా బ్యాంకులో కూడా డిపాజిట్ చేయలేం. రద్దు చేసిన తర్వాత కొంతకాలం మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటుని ఆర్బీఐ కల్పించింది. తర్వాత ఆ అవకాశాన్ని కూడా ఉపసంహరించుకుంది. ఆ గడువు 2023 అక్టోబర్ 7 తో ముగిసిపోయింది. ఆ తర్వాత దాదాపుగా అందరూ 2వేల నోట్లను మరచిపోయారు. ఇక ఎవరి వద్ద కూడా ఆ నోట్లు లేవనే అనుకున్నారు. కానీ ఉన్నాయి. ప్రభుత్వం నోట్లను ఉపసంహరించుకునే నాటికి ఆ నోట్ల మొత్తం విలువ 3.56 లక్షల కోట్ల రూపాయలు. వాటిలో 98.35 శాతం నోట్లు తిరిగి ఆర్బీఐకి చేరుకున్నాయి. ఇంకా 1.65 శాతం నోట్లు జనం వద్ద ఉన్నాయి. వాటి విలువ 5884 కోట్ల రూపాయలు. ఆ నోట్లను తిరిగి ఆర్బీఐ సేకరించాలనుకుంటోంది. అందుకే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది.

Advertisement

Also Read: టాటా సుమో రీఎంట్రీ.. 2025 మోడల్‌లో ఏం కొత్తగా వచ్చాయో తెలుసా?

2వేల నోట్లను ఏం చేయాలి?
మీ వద్ద ఇంకా 2వేల రూపాయల నోట్లు ఉంటే మాత్రం.. వాటిని మార్చుకోడానికి ఇంకో ఆఖరి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని నోటిఫికేషన్ రూపంలో విడుదల చేసింది ఆర్బీఐ. ఇప్పటికీ మీ వద్ద 2వేల నోట్ల రూపాయలు ఉంటే అధికారికంగా వాటిని మార్పిడి చేసుకోవచ్చు. ఆ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 19 ప్రాంతీయ కార్యాలయాలలో మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. ఆయా కార్యాలయాలలో నేరుగా నోట్లను డిపాజిట్ చేయడానికి ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఆ కార్యాలయాలకు వెళ్లడానికి అవకాశం లేకపోతే, పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా వాటిని RBI కార్యాలయాలకు పంపించవచ్చు. అలా పంపిస్తే, సదరు ఖాతాదారుడు కోరిన బ్యాంక్ అకౌంట్లో ఆ నగదుకి సరిపడా సొమ్ముని ఆర్బీఐ డిపాజిట్ చేస్తుంది. అయితే ఇదే ఆఖరి అవకాశమా, లేక ఇంకా ఈ అవకాశం ఉంటుందా అనేది స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్లో చివరి తేదీని ప్రకటించలేదు. అంటే ఈ అవకాశాన్ని మరికొన్నాళ్లు పౌరులు ఉపయోగించుకోవచ్చనమాట.

Advertisement

Also Read: ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌.. కేవలం రూ.155కే అపరిమిత కాల్స్!

ఆ తేడా మీకు తెలుసా?
2వేల రూపాయల నోటు ఇంకా చట్టబద్ధమైన ద్రవ్యంగానే ఉంది. అంటే 2వేల రూపాయల నోటు విలువ సున్నాకి చేరలేదు. దానికి విలువ ఉంది. అయితే ఆ విలువను మనం సాధారణ మార్కెట్ లో మార్చుకోలేం. అలాగని, బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేం. కేవలం ఆర్బీఐ శాఖల్లో మాత్రమే వాటిని మార్చుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకండి, 2వేల రూపాయల నోటు చట్టబద్ధమైన ద్రవ్యంగా ఉన్నప్పుడే వాటిని మార్చుకోండి.

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×