E-Paper
Advertisement

Reliance Shares: 1988లో రిలయన్స్ షేర్లను రూ.10తో కొన్నాడు..ఇప్పుడు వాటి విలువ తెలిసి షాక్!

Reliance Shares: 1988లో రిలయన్స్ షేర్లను రూ.10తో కొన్నాడు..ఇప్పుడు వాటి విలువ తెలిసి షాక్!
Advertisement

Reliance Shares: స్టాక్ మార్కెట్ ఎప్పుడు, ఎవరిని మిలియనీర్లను చేస్తుందో చెప్పలేం. ఒక్క రోజు లోనే అనేక మంది ఎదిగిన వారు ఉన్నారు. అదే సమయంలో భారీగా నష్టపోయిన వారు సైతం కనిపిస్తారు. అయితే ఒక ప్రణాళిక ప్రకారం పలు కంపెనీల షేర్స్ కొనుగోలు చేసి దీర్ఘకాలంలో పెట్టుబడులు చేస్తే మాత్రం మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో కూడా అనేక మంది పలు కంపెనీలు భవిష్యత్తులో ఎదుగుతాయని భావించి, షేర్లను ఎప్పుడో కొనుగోలు చేసి మిలియనీర్లు, కోటీశ్వరులు అయిన వారు సైతం ఉన్నారు. ఇప్పుడు కూడా అచ్చం అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

తెలియకుండా పెట్టుబడి..

చండీగఢ్‎కు చెందిన రత్తన్ దిల్లాన్ అనే వ్యక్తి ఇటీవల తన ఇంట్లో దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL)షేర్ల కాపీ దొరికిందని, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ క్రమంలో తనకు స్టాక్ మార్కెట్ గురించి తెలియదని, ఈ షేర్లు ఇప్పటికీ మన దగ్గర ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం ఎలా అని సహాయం కోరుతూ ప్రశ్నించారు. ఆ వ్యక్తి పోస్ట్ చేసిన చిత్రాలలో రిలయన్స్ షేర్లను 1988లో ఒక దానిని రూ.10 ధరకు కొనుగోలు చేసినట్లుగా కనిపిస్తుంది.

Advertisement

ఇప్పుడు లక్షాధికారి..

దిల్లాన్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన అనేక మంది స్పందించడం ప్రారంభించారు. ఎందుకంటే అప్పట్లో రిలయన్స్ షేర్ల విలువ చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు రిలయన్స్ షేర్లు ప్రస్తుత మార్కెట్‌లో చాలా ఖరీదైనవిగా మారాయి. అంతేకాదు ఆ తర్వాత కంపెనీ బోనస్ షేర్లను అనేక సార్లు ప్రకటించింది. రత్తన్ దిల్లాన్ వద్ద మొదటగా 30 షేర్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు 863 షేర్లకు చేరుకుందని ఓ నెటిజన్ చెప్పారు. స్టాక్ విభజనల కారణంగా వాటి సంఖ్య కూడా పెరిగిందన్నారు.

Advertisement

Read Also: Employee Work Pressure: షాకింగ్ రిపోర్ట్.. తీవ్ర ఒత్తిడిలో 52% మంది ఉద్యోగులు..

నెటిజన్ల కామెంట్స్

అప్పుడు 30 షేర్ల కోసం రూ. 300 ఖర్చు చేయగా, ఇప్పుడు ప్రస్తుతం (మార్చి 12న) షేరు విలువ ప్రకారం చూస్తే ఒక్కొక్కటికి రూ. 1,255.95కు చేరాయని చెప్పవచ్చు. దీని ప్రకారం చూస్తే వాటి మొత్తం షేర్ల విలువ ఇప్పుడు రూ. 10.83 లక్షలకు చేరుకుంది. ఇది తెలిసిన అనేక మంది ఆయన పెట్టుబడి ధోరణిని మెచ్చుకుంటున్నారు. రత్తన్ స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి అవగాహన లేకుండానే, ఆ రోజుల్లోనే షేర్లు కొనుగోలు చేసి ఇప్పుడు లక్షల రూపాయలు సంపాదించారని ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో విజయం సాధించాలంటే ప్రముఖ సంస్థల్లో దీర్ఘకాల పెట్టుబడులు చేయడం చాలా కీలకమని చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఇది చూసిన మరికొంత మంది ఆశ్చర్యపోతున్నారు.

వాటి ధృవీకరణ కోసం..

దిల్లాన్ తన షేర్ల ధృవీకరణకు సంబంధించి గవర్నమెంట్ సంస్థ IEPFA (ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ) సహాయం తీసుకోవాలని ఓ నెటిజన్ సూచించారు. IEPFA వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసి ఆ షేర్ల బదిలీ సహా పలు వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ఈ వెబ్‌సైట్ వినియోగదారులకు తప్పుగా లభించిన లేదా క్లెయిమ్ చేయని షేర్లను ట్రాక్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×