E-Paper
Advertisement

boAt Data Breach: బోట్ యూజర్లకు షాక్.. ప్రమాదంలో 75 లక్షల మంది డేటా..!

boAt Data Breach: బోట్ యూజర్లకు షాక్.. ప్రమాదంలో 75 లక్షల మంది డేటా..!
Advertisement
boAt Data Breach
boAt Data Breach

7.5 Million boAt Users Personal Information Leaked boAt Data Breach: ప్రముఖ స్మార్ట్ వాచ్, ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ బోట్ యూజర్ల డేటా లీకైంది. దాదాపు 75 లక్షల మంది డేటా లీకైనట్లు సమాచారం. లీకైన డేటాలో వినియోగదారుల పేర్లు, అడ్రెస్‌లు, మొబైల్ నంబర్లు, కస్టమర్ ఐడీలు ఉన్నాయి. ఉల్లంఘనకు గురైన డేటాలో 2జీబీ డేటాను హ్యాకర్ డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉంచినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది.

షాపిఫైగై అనే హ్యాకర్ బోట్‌కు చెందిన డేటాను ఏప్రిల్ 5వ తేదీన డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు ఫోర్బ్స్ తెలిపింది. దీని వలన యూజర్ల డేటా బయటకు లీక్ అవ్వడమే కాకుండా.. సైబర్ ఎటాక్స్ జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

ఈ డేటాను ఉపయోగించి యూజర్ల బ్యాంకు అకౌంట్స్ నిర్వహించడమే కాకుండా.. క్రెడిట్ కార్డులను వినియోగించి ఆర్ధిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఘటన కచ్చితంగా వినియోగదారులకు మేల్కొలుపులాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డార్క్ వెబ్‌లో ఉన్న సుమారు 7.5 మిలియన్ల వినియోగదారుల వ్యక్తిగత డేటా దోపిడీకి గురవుతుందని పేర్కొన్నారు. “వ్యక్తులు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించినట్లయితే, అన్ని సంబంధిత అకౌంట్లలో తక్షణమే మార్చుకోవాలి. ఈ వేగవంతమైన చర్యలను తీసుకోవడం ద్వారా, వినియోగదారులు అనధికార యాక్సెస్ ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించవచ్చు, వారి సున్నితమైన సమాచారాన్ని దోపిడీ నుండి రక్షించుకోవచ్చు, ”అని సెకెల్ టెక్ CEO, వ్యవస్థాపకుడు రాకేష్ రఘువంశీ పేర్కొన్నారు.

Advertisement

Also Read: DATA BREACH: కొవిడ్ టెస్టింగ్.. మీ కొంప ముంచిందా..?

గతంలో భారతదేశంలోని ఇతర డేటా ఉల్లంఘనల జరిగనట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇది మిలియన్ల మంది భారతీయుల డేటా చోరీకి దారితీసింది. భారతీయుల ఆధార్ నంబర్‌లతో సహా – డార్క్ వెబ్ ఫోరమ్‌లలో అమ్ముడవుతోంది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×