E-Paper
Advertisement

IRAN War: ఇరాన్ యుద్ధం ప్రభావం.. వాటర్ బాటిళ్లకు సెగ, ఎండాకాలంతో ధరలు పెరిగే ఛాన్స్

IRAN War: ఇరాన్ యుద్ధం ప్రభావం.. వాటర్ బాటిళ్లకు సెగ, ఎండాకాలంతో ధరలు పెరిగే ఛాన్స్
Advertisement

IRAN War: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం అనేక రంగాలకు కుదిపేస్తోంది. కేవలం ఎల్‌పీజీ గ్యాస్, ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం సెగలు వేసవి కాలం ప్రారంభం కావడానికి ముందే ప్యాక్ చేసిన నీటి బాటిళ్ల మార్కెట్‌ను కుదిపేస్తోంది. యుద్ధానికి నీటికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

ఇరాన్ యుద్ధం ప్రభావం.. వాటర్ బాటిళ్లకు సెగ

Advertisement

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో వాటర్ బాటిల్ పరిశ్రమ ఒకటి. దేశంలో ప్యాకేజ్డ్‌ వాటర్‌ మార్కెట్‌ దాదాపు 5 బిలియన్‌ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.46,000 కోట్లు అన్నమాట. తాజాగా యుద్ధం ప్రభావం తాగునీటి సీసాలు, మూతలపై పడింది. అసలే వేసవి కాలం తీవ్రమవుతున్న తరుణంలో నీటి సీసాల ధరలు పెరిగే అవకాశం ఉంది. యుద్ధం నేపథ్యంలో కొంతమంది తయారీ, పంపిణీదారుల వాటర్ బాటిళ్ల ధరలను పెంచేందుకు రెడీ అయ్యారు.

ప్లాస్టిక్‌ బాటిళ్ల తయారీలో పాలిమర్‌ కీలక ముడి వస్తువు. ఇది కేవలం ముడి చమురు నుంచి వస్తుంది. మార్కెట్లో చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో పాలిమర్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. సీసాల తయారీలో ఉపయోగించే ముడిపదార్థం ధర 50 శాతం పెరిగింది. అంటే కిలోకు రూ.170కు చేరింది. బాటిల్ మూతల ధర రెట్టింపు కంటే ఎక్కువ. ఒక్కొక్కటి బాటిల్‌పై దాదాపు అర్ధరూపాయి చేరినట్లు సమాచారం.

Advertisement

మంచినీటి బాటిళ్ల ధరలు పెరిగే అవకాశం

ఇక ప్యాకింగ్‌ బాక్సులు, లేబుల్స్, టేపుల ధరలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. దీని విషయంలో పెద్ద కంపెనీలు పెరిగిన ముడి వస్తువుల ధరల భారాన్ని భరిస్తున్నాయి. సీసాలు తయారీ దాదాపు 2000 సంస్థలు తమ రీసెల్లర్ల కోసం ధరలను బాటిల్‌కు రూపాయి చొప్పున పెంచారట.

వచ్చేది వేసవికాలం కావడంతో రాబోయే రోజుల్లో ఇది మరో 10 శాతం పెరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. నార్మల్ గా వినియోగదారులు ఒక లీటర్‌ నీటి సీసాకు 15 నుంచి 20 రూపాయాలు చెల్లిస్తున్నారు. రాబోయే 4 లేదా 5 రోజుల్లో వినియోగదారులపై ధరలపై ప్రభావం చూపుతుందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి అపూర్వ దోషి అన్నారు.

ALSO READ: ఈ టిప్స్ పాటిస్తే.. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు సేఫ్!

1.4 బిలియన్ల జనాభా కలిగిన భారత్‌లో పరిశుభ్రమైన నీరు విలాసంగా మారింది. దేశంలో 70 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యాయని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు బాటిల్ వాటర్‌పై ఆధారపడతారు. అందులో బిస్లరీ, కోకా-కోలా, కిన్లీ, పెప్సీస్, అక్వాఫినా, రిలయన్స్, టాటా సంస్థలు దాదాపు 5 బిలియన్ల మార్కెట్‌లో వాటా కోసం పోటీ పడుతున్నాయి. మొత్తానికి యుద్ధం ప్రభావం మంచినీటి బాటిళ్లపై పడనుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×