E-Paper
Advertisement

Hyundai Hybrid Vehicle: హైబ్రిడ్ టెక్నాలజీపై హ్యుందాయ్ ఫోకస్.. 2026 నాటికి మొదటి వెహికల్!

Hyundai Hybrid Vehicle: హైబ్రిడ్ టెక్నాలజీపై హ్యుందాయ్ ఫోకస్.. 2026 నాటికి మొదటి వెహికల్!
Advertisement

Hyundai Planning to Launch Hybrid Vehicle on 2026 in India: హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్న కార్లకు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశంలో హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థల్లో ఒకటైన దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ త్వరలో హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో మారుతి, టయోటా కంపెనీలకు గట్టీపోటీ ఇవ్వనుంది. హ్యుందాయ్ హైబ్రిడ్ టెక్నాలజీ కార్లను ఎప్పుడు లాంచ్ కానున్నాయి? తదితర విషయాలు తెలుసుకోండి.

మీడియా నివేదికల ప్రకారం కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ యుయిసన్ చుంగ్ భారతీయ ఉద్యోగులతో మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు, హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన కార్లు కూడా పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన భాగంగా ఉంటాయని చెప్పారు. ఈ టెక్నాలజీతో గత ఆర్థిక సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 85 నుంచి 90 వేల కార్లు అమ్ముడయ్యాయి. ఇది మొత్తం అమ్మకాలలో రెండు శాతం.

Advertisement

ప్రస్తుతం హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన వాహనాలను మారుతీ, టయోటా భారత మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఈ ఏడాది కూడా హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన అనేక కార్లను తమ పోర్ట్‌ఫోలియోకు తీసుకురావడానికి రెండు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సమాచారం ప్రకారం మారుతి సుజుకి 2031 నాటికి హైబ్రిడ్ టెక్నాలజీతో 7.5 లక్షల యూనిట్ల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో హ్యుందాయ్ ఈ టెక్నాలజీతో కూడిన కార్లను తీసుకువస్తే నేరుగా మారుతికి, టయోటాకు పోటీ ఇస్తుంది.

Also Read: టీవీఎస్ రైడర్ 125 షాకింగ్ రివ్యూ.. కొనేముందు కచ్చితంగా చూడండి!

Advertisement

నివేదికల ప్రకారం హ్యుందాయ్ మోటార్ గ్రూప్ నుండి మొదటి హైబ్రిడ్ కారును 2026 నాటికి మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కంపెనీ హైబ్రిడ్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెడుతోంది.  హ్యుందాయ్‌తో పాటు, కియా కూడా హైబ్రిడ్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సమాచారం ప్రకారం 2026-27 నాటికి హైబ్రిడ్ టెక్నాలజీతో క్రెటా, అల్కాజార్, వెర్నా, టక్సన్ వంటి వాహనాలను భారతదేశానికి తీసుకురావచ్చు. దీనికి ముందు కంపెనీ 2025 నాటికి క్రెటాను ఎలక్ట్రిక్ SUVగా పరిచయం చేయవచ్చు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×