E-Paper
Advertisement

Deceased Account Settlement: చనిపోయిన వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు.. వారసులు ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసా?

Deceased Account Settlement: చనిపోయిన వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు.. వారసులు ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసా?
Advertisement

Deceased Account Settlement: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరి అయింది. స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రభుత్వ పథకాలు, సొంత అవసరాలకు బ్యాంకు అకౌంట్ అవసరమవుతుంది. అయితే మరణించిన వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు, లాకర్లలోని వస్తువులను నామినీ లేదా వారసులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయంపై చాలా మందికి అవగాహన తక్కువ.

మరణించిన కస్టమర్ల ఖాతాలు, లాకర్ల క్లెయిమ్‌ల పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ఓ ముసాయిదా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఖాతాదారులు నామినీని ప్రకటించని సమయంలో లేదా సర్వైవర్‌ నిబంధన లేకుండా జాయింట్ అకౌంట్ ఉన్న సందర్భాల్లో రూ.15 లక్షల వరకు క్లెయిమ్‌లను పరిష్కరించాలని బ్యాంకులను కోరింది.

Advertisement

ఖాతాదారుడు నామినీ ప్రకటించని సందర్భంలో డిపాజిట్ ఖాతాలలో లేదా నామినీ/సర్వైవర్‌ నిబంధన లేకుండా జాయింట్ ఖాతా ఉంటే చట్టపరమైన వారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని క్లెయిమ్ లు చేయాలి. బ్యాంకు, దాని రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ల ఆధారంగా రూ.15 లక్షల వరకు చెల్లించవచ్చని ఆర్బీఐ పేర్కొంది.

క్లెయిమ్ మొత్తం రూ.15 లక్షల వరకు ఉన్నప్పుడు మరణించిన డిపాజిటర్ ‘వీలునామా’ లేకపోతే లేదా ఏదైనా వివాదాస్పద క్లెయిమ్ లేదా కోర్టు ఆర్డర్ కాపీ లేని పలు మార్గదర్శకాలు సూచించింది ఆర్బీఐ.

క్లెయిమ్ చేయడానికి అవసరమయ్యే పత్రాలు

Advertisement

హక్కుదారులు క్లెయిమ్ ఫామ్ నింపి, సంతకం చేయాలి.

ఖాతాదారుల మరణ ధృవీకరణ పత్రం

వారసుల ధృవీకరణ పత్రం

Annex I-C లో హక్కుదారులు సంతకం చేసిన పూచీకత్తు బాండ్

చట్టపరమైన వారసుల(క్లెయిమ్ చేయని వారు) నుంచి నిరభ్యంతర లెటర్

సంబంధిత ప్రభుత్వ అధికారుల నుంచి చట్టపరమైన వారసుల ధృవీకరణ పత్రం

మరణించిన వ్యక్తి గురించి బాగా తెలిసి, ఆ కుటుంబంతో సంబంధం లేని బ్యాంకు ఆమోదించిన స్వతంత్ర వ్యక్తి నుంచి డిక్లరేషన్

క్లెయిమ్ రూ.15 లక్షల కంటే ఎక్కువగా ఉంటే కావాల్సిన పత్రాలు

క్లెయిమ్ మొత్తం రూ.15 లక్షల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రం లేదా సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికేట్ పొందాలి.

మరణించిన వ్యక్తి కుటుంబానికి బాగా తెలిసి, ఆ కుటుంబంతో సంబంధంలేని బ్యాంకు ఆమోదించిన స్వతంత్ర వ్యక్తి ద్వారా న్యాయమూర్తి/ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు అఫిడవిట్‌ పై సంతకం చేయాలి.

ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ డ్రాఫ్ట్ జనవరి 1, 2026 నుండి లేదా అంతకంటే ముందు, కేంద్రం, బ్యాంకుల తుది ఆమోదానికి లోబడి అమల్లోకి రావచ్చు.

సత్వర క్లెయిమ్ కోసం

మరణించిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను సత్వర సెటిల్మెంట్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మరణించిన ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, వాటిలోని వస్తువులను నామినీలకు అప్పగించే ప్రక్రియను ఆర్బీఐ సులభతరం చేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా వీలైనంత త్వరగా ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని బ్యాంకులను కోరింది.

Also Read: PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

ఆర్బీఐ మార్గదర్శకాలు

  • చనిపోయిన వ్యక్తి బ్యాంకు అకౌంట్ మొత్తాన్ని నామినీకి, జాయింట్ ఖాతా అయితే సర్వైవర్ కు చెల్లించాలి.
  • ఖాతాదారుడు నామినీని పేర్కొనకపోతే డిపాజిట్ మొత్తం తక్కువగా ఉంటే సులభతర పద్ధతిలో చట్టపరమైన వారసులకు సెటిల్ చేయాలి.
  • సహకార బ్యాంకులైతే రూ.5 లక్షల లోపు, ఇతర బ్యాంకులైతే రూ.15 లక్షలను గరిష్ఠ పరిమితిగా పెట్టుకోవాల్సి ఉంది.
  • బ్యాంకుల బోర్డులు అనుమతిస్తే ఇంతకు మించిన అధిక మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.
  • అయితే క్లెయిమ్ చేయడానికి వారసత్వం సర్టిఫికెట్లు లేదా చట్టబద్ద వారసుడనే సర్టిఫికెట్లు అవసరం ఉంటుంది.
  • చనిపోయిన ఖాతాదారుల నామినీలు, వారసుల నుంచి క్లెయిమ్ అందిన 15 రోజుల్లోగా సెటిల్మెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • 15 రోజుల్లోగా క్లెయిమ్ సెటిల్ చేయకపోతే అందుకు గల కారణాలను నామినీ, వారసులకు తెలియజేయాలి.
  • సరైన కారణం లేకుండా ఆలస్యం చేస్తే, ఖాతాలోని మిగులుపై బ్యాంక్ అమలు చేస్తున్న వడ్డీపై అధికంగా 4% వార్షిక వడ్డీ చెల్లించాలి.
  • లాకర్ లోని వస్తువుల అప్పగింతలో ఆలస్యమైతే రోజుకు రూ.500 చొప్పున క్లెయిమ్ దారులకు జరిమానా చెల్లించాలి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×