E-Paper
Advertisement

Hindenburg vs Adani: అదానీ గ్రూప్‌లో సెబీ ఛైర్‌పర్సన్‌‌కు వాటాలు.. మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్

Hindenburg vs Adani: అదానీ గ్రూప్‌లో సెబీ ఛైర్‌పర్సన్‌‌కు వాటాలు.. మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్
Advertisement

Hindenburg alleges SEBI chief Madhabi Buch linked to Adani offshore Entities: అదానీ గ్రూప్‌ కంపెనీలపై అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ మరో బాంబ్ పేల్చింది. సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పూరీ బచ్, ఆమె భర్తకు అదానీ సంస్థల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మారిసెస్ కంపెనీల్లోని ఇద్దరికీ రహస్య వాటాలున్నాయంటూ హిండెన్‌బర్గ్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. దీంతో.. మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిండెన్ బర్గ్ ఆరోపణలతో మార్కెట్‌లో ఎలాంటి కుదుపు వస్తుందోనని భయపడుతున్నారు.

ఏడాదిన్నరగా అదానీ వర్సెస్ హిండెన్ బర్గ్ ఎపిసోడ్ నడుస్తోంది. 2023 జనవరి 23న కూడా హిండెన్‌బర్గ్ అదానీ సంస్థలపై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ తమ కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని విమర్శించారు. ధరలు పెంచిన షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకొని మోసాలకు పాల్పడిందని గతేడాది హిండెన్ బర్గ్ ప్రధాన ఆరోపణ. కరేబియన్‌, మారిషస్‌ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని అప్పటో బాంబ్ పేల్చింది.

Advertisement

హిండెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూశాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి గౌతమ్ అదానీ చాలా చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఫైనల్ గా మళ్లీ షేర్ విలువ పైకి వచ్చింది. హిండెన్‌బర్గ్ నివేదికపై సెబీ దర్యాప్తు చేసి కీలక విషయాలను కూడా ప్రకటించింది. అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.

Also Read: షాకిచ్చిన బంగారం.. మళ్లీ రూ.70 వేలు దాటేసిందిగా !

Advertisement

అంతేకాదు.. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనక చైనా హస్తం ఉందనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల్లో సెబీ చైర్మన్ కు షేర్లు ఉన్నాయని ప్రకటించింది. గతంలో తమ నివేదికపై సెబీ దర్యాప్తు చేయకపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమని హిండెన్ బర్గ్ ప్రధాన విమర్శ.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×