E-Paper
Advertisement

FMCG Companies Price Increased: జేబుకు చిల్లు.. సబ్బులతోపాటు మరికొన్ని వస్తువుల ధరల పెంపు..!

FMCG Companies Price Increased: జేబుకు చిల్లు.. సబ్బులతోపాటు మరికొన్ని వస్తువుల ధరల పెంపు..!
Advertisement

FMCG Companies Price Increased: కామన్‌మేన్ జేబుకు చిల్లు పడుతుందా? కుటుంబంలో నెల వారీ వ్యయం పెరగబోతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా కొన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కొన్ని వస్తువుల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.

సబ్బులు, షాంపూలు, ఫుడ్‌కి సంబంధించి కొన్ని సెలక్ట్ ఫుడ్ ఐటమ్స్, నెస్లే కాఫీ, మ్యాగీ న్యూడిల్స్, ఓట్స్ వంటివి ఇందులో ఉండబోతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచాయి. మరి కొన్ని కంపెనీలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. వున్నట్లుండి ధరల పెరుగుదల వెనుక కారణమేంటన్న చర్చ సామాన్యుల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యం గా ఉత్పత్తులకు కావాల్సిన ముడి పదార్ధాల ధరలు పెరగడమే దీనికి కారణంగా చెబుతున్నాయి కంపెనీలు.

Advertisement

సబ్బులు, బాడీ వాష్ ధరలు 2 నుంచి 9 శాతం, హెయిర్ సంరక్షణ నూనెలు 8 నుంచి 11 శాతం, డోవ్ సబ్బులైతే రెండుశాతం పెరగనున్నాయి. ఇవేకాకుండా ఎంపిక చేసిన కొన్ని ఫుడ్ ఐటెమ్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అవి 3 నుంచి 17 శాతం పెంచేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. హల్ షాంపూ, స్కిన్ ఉత్పత్తుల ధరలైతే 4 శాతం, మ్యాగీ ఓట్స్, నూడుల్స్ 17 శాతం, డాబర్ ఇండియా 1 నుంచి 5 వరకు, బికాజీ ఉత్పత్తులు 2 నుంచి 4 శాతం జాబితాలో ఉన్నాయి.

Also Read: ఇచ్చిపడేశాడు బ్రో.. ఈ కార్లపై ఊహకందని తగ్గింపు.. కొద్ది రోజులే..!

Advertisement

2022, 2023 ప్రారంభంలో కమొడిటీ ధరలు పెరిగాయని, ఈ క్రమంలో కొంత భారాన్ని వినియోగదారుల పైకి సంబంధిత కంపెనీ నెట్టేశాయి. గతేడాది కంటే ముడి చమురు, పామాయిల్ ధరలు తగ్గినా పాలు, పంచదార, కాఫీ వంటి ముడి పదార్ధాల ధరలు పెరగడమే ఉత్పత్తుల ధరల పెంపునకు కారణంగా చెబుతున్నాయి. ఖర్చులు పెరుగుతున్నాయని, రాబడి అంతంత మాత్రమేగానే ఉందని అంటున్నారు. ఇలాగైతే ఏదీ కొనుక్కొని తినే పరిస్థితి ఉండదని సగటు సామాన్యులు పెదవి విరుస్తున్నారు.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×