E-Paper
Advertisement

Byju Raveendran: ఈ నెల ఓకే, మరి నెక్ట్స్ మంత్ మాటేంటి?

Byju Raveendran: ఈ నెల ఓకే, మరి నెక్ట్స్ మంత్ మాటేంటి?
Advertisement

Byju Raveendran: బల్లు ఓడలు.. ఓడలు బల్లు అవ్వడమంటే ఇదేనేమో. తక్కువ సమయంలో బాగా పాపులర్ అయ్యింది ఎడ్ టెక్ కంపెనీ బైజూస్. ఇదంతా ఒకప్పుడు మాట. కాలం మారుతోంది.. పరిస్థితులు మారాయి. కంపెనీ ఫౌండర్ ఆశలు గల్లంతయ్యాయి. చివరకు ఆ కంపెనీలో పని చేసిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. చివరకు పర్సనల్ లోన్ తీసుకుని శాలరీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బైజూస్‌లో ప్రస్తుతం 13000 వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు ఓ అంచనా. వీరి కోసం దాదాపు 30 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్లకు జీతంలో 50 నుంచి 100 శాతం వేశారని ఎంప్లాయిస్ చెబుతున్నమాట. ముఖ్యమైన సిటీల్లో బైజూన్ ఏర్పాటు చేసిన టీచింగ్ సెంటర్లలోని టీచర్లకు, కింది స్థాయి ఉద్యోగులకు 100శాతం జీతం ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్, టీచింగ్ సెంటర్ల మేనేజన్లకు సగం జీతం ఇచ్చినట్టు సమాచారం. రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన మనీ బ్లాక్ కావడంతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు పర్సనల్‌‌గా ఫండ్స్ సేకరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Advertisement

బైజూస్ కంపెనీలోని నలుగురు షేర్ హోల్డర్స్ రవీంద్రన్‌కు, ఆయన ఫ్యామిలీకి వ్యతిరేకంగా కేసు వేశారు. రైట్స్ ఇష్యూ ఫండ్స్‌‌ను కంపెనీ వినియోగించుకోకుండా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ కేసు వ్యవహారం ఇవాళ మళ్లీ విచారణ జరుగుతోంది. మంగళవారం తీర్పు బైజూస్ రవీంద్రన్‌కు అనుకూలంగా వస్తుందా? లేకపోతే పరిస్థితి ఏంటన్నది ముందున్న ప్రశ్న. రవీంద్రన్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందని అంటున్నారు. రాకపోతే నెక్ట్స్ మంత్ శాలరీల పరిస్థితి ఏంటన్నది తెలియాల్సిఉంది.

ప్రస్తుతం బైజూస్ కంపెనీ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన లెర్నింగ్ సెంటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా బెంగుళూరులోని నాలెడ్జ్ పార్కులోని ఉన్న ప్రధాన ఆఫీసు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లెర్నింగ్ సెంటర్లలో పని చేస్తున్న ఉద్యోగులు మినహా.. మిగిలినవారు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో బైజూస్ ఆఫీసుల లీజు గడువు మిగియగానే వాటిని కూడా క్లోజ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం పునర్ వ్యవస్థీకరణలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్లు చెబుతోంది.

Advertisement

ALSO READ: గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్..

కరోనా సమయంలో సూళ్లు మూతబడడంతో ఆన్‌లైన్ క్లాసులకు మాంచి డిమాండ్ పెరిగింది. బైజూస్ వేగంగా విస్తరించడం, బిజినెస్ పుంజుకోవడం మొదలైంది. తర్వాత నాలుగైదు కంపెనీల్లో పెట్టుబడులను పెట్టడం, వాటిని టేకోవర్ చేయడంతో జరిగింది. చాలామంది విదేశీ ఇన్వెస్టర్లు బైజూస్‌లో పెట్టుబడులు పెట్టారు. సూళ్లు ఓపెన్ అయిన తర్వాత కంపెనీకి క్రమంగా నష్టాలు రావడం మొదలయ్యాయి. తర్వాత మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో డైరెక్టర్లు తప్పుకున్నారు.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×