E-Paper
Advertisement

BSNL 5G: హైదరాబాద్‌లో BSNL 5G ట్రయల్ రన్.. టెన్షన్‌లో జియో, ఎయిర్‌టెల్

BSNL 5G: హైదరాబాద్‌లో BSNL 5G ట్రయల్ రన్.. టెన్షన్‌లో జియో, ఎయిర్‌టెల్
Advertisement

BSNL 5G: ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచినప్పటి నుండి BSNL ఇంటికి తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు టారిఫ్‌ను పెంచని టెలికాం కంపెనీ బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే. దీని తర్వాత అకస్మాత్తుగా BSNL ప్రవేశించింది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది. గతంలో జరిగిన టెలికాం రేసులో BSNL కంపెనీ Jio, Airtel, Vi చేతిలో ఓటమిపాలైంది. ఎందుకంటే దాని చేతిలో ఇంకా 5G  సర్వీసెస్ అందుబాటులో లేవు. వీటన్నింటి మధ్య BSNL అద్భుతమైన డీల్ పొందింది. దీని కారణంగా ప్రైవేట్ టెలికాం కంపెనీల టెన్షన్ పెరగబోతోంది.

BSNL ప్రస్తుతం 3G సర్వీస్‌లను అందిస్తోంది. తన 4G నెట్‌వర్క్‌ను విస్తరించడానికి వేగంగా పని చేస్తోంది. అదే సమయంలో Jio, Airtel 5G నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. అయితే BSNL ఇప్పుడు ఒక అద్భుతాన్ని సృష్టించేందుకు సిద్ధమైంది. భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ మొబైల్ టవర్ ఉపయోగించి 5G సేవ అందించనుంది. దీంతో జియో-ఎయిర్‌టెల్ కంపెనీల మధ్య టెన్షన్ పెరుగుతుంది. అలాగే మొబైల్ వినియోగదారులు తక్కువ ధరకే హై స్పీడ్ డేటా, కాలింగ్ సౌకర్యాలను పొందవచ్చని భావిస్తున్నారు.

Advertisement

బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయాన్ని అందిస్తోంది. జూన్ 2023లో ప్రభుత్వం రూ. 89,047 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించింది. BSNLతో దేశీయ టెలికాం స్టార్టప్ కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. ఇందుకోసం కంపెనీ ట్రయల్ సర్వీసును ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ట్రయల్ ఒకటి నుండి మూడు నెలల్లో ప్రారంభమవుతుంది. ఇందులో పబ్లిక్ కాని నెట్‌వర్క్‌లపై దృష్టి సారిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కింద ప్రారంభంలో BSNL హోల్డింగ్ 700MHz బ్యాండ్ ఉపయోగించనుంది. ఈ 5G ట్రయల్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.

BSNL 5G Network Testing Cities

  • ఐఐటీ – ఢిల్లీ
  • జెఎన్‌యూ క్యాంపస్ – ఢిల్లీ
  • కన్నాట్ ప్లేస్ – ఢిల్లీ
  • సంచార్ భవన్ – ఢిల్లీ
  • ప్రభుత్వ కార్యాలయం – బెంగళూరు
  • ఐఐటీ – హైదరాబాద్
  • ఇండియా హాబిటాట్ సెంటర్ – ఢిల్లీ
  • టీసీఎస్‌ కంపెనీలు
Advertisement

Also Read: LIC Scheme for Daughter: పాలసీ అదిరింది.. కూతురు పెళ్లికి ఎల్‌ఐసీ భారీ కట్నం!

వాయిస్ ఆఫ్ ఇండియన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎంటర్‌ప్రైజెస్ (VoICE) నివేదిక ప్రకారం పబ్లిక్ టెలికాం కంపెనీ ప్రజల ఉపయోగం కోసం 5G ట్రయల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది టాటా కన్సల్టెన్సీ, తేజస్ నెట్‌వర్క్, VNL, యునైటెడ్ టెలికాం, కోరల్ టెలికాం, HFCL వంటి స్వదేశీ టెలికాం కంపెనీలతో కలసి చేయనున్నారు. ఈ గ్రూప్ కంపెనీలు BSNL నెట్‌వర్క్‌ని ఉపయోగించి 5G ట్రయల్స్ నిర్వహిస్తాయి. ప్రభుత్వం BSNLకి 700MHz, 2200MHz, 3300MHz, 26GHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను కేటాయించింది. ఈ స్పెక్ట్రమ్ సహాయంతో BSNL దేశవ్యాప్తంగా 4G, 5G నెట్‌వర్క్‌లను అందిస్తుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×