E-Paper
Advertisement

Urmila Chaturvedi : అపర శబరి.. ఊర్మిళా చతుర్వేది..!

Urmila Chaturvedi : అపర శబరి.. ఊర్మిళా చతుర్వేది..!
Advertisement
Urmila Chaturvedi

Urmila Chaturvedi : ఏనాటికైనా రామచంద్రుడు తన ఆశ్రమానికి వస్తాడని, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలని రామాయణ కాలంలో.. శబరి జీవితాంతం ఎదురుచూసింది. అది నాటి శబరి కథ కాగా.. రామాలయం నిర్మాణం ఖాయం అనే వార్త వినేవరకు అన్నం ముట్టనని ఏకంగా 28 ఏళ్లపాటు నిరాహార దీక్ష చేసిన నేటి శబరిగా ఊర్మిళా చతుర్వేది(82) జనం మనసులో నిలిచిపోయారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఊర్మిళ గతంలో సంస్కృతం టీచరుగా పనిచేశారు.

1992లో బాబ్రీ మసీదు కూల్చేసిన రోజు నుంచి ఆమె సాధారణ ఆహారం తీసుకోవడం మానేశారు. 27 ఏళ్లుగా పాలు, పండ్లనే పరిమితంగా తీసుకుంటూ రామనామం చేస్తూ వచ్చారు. ఈ 28ఏండ్లలో ఎంతో మంది బంధువులు తనని ఆహారం తీసుకొమ్మని బలవంతం చేసినా ఆమె మాత్రం ఎంతో భక్తి, శ్రద్ధలతో తన ఉపవాసాన్ని కొనసాగించింది.

Advertisement

అయోధ్యలో రామ జన్మభూమి స్థలమంతా హిందువులకే చెందాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన రోజు బంధువులు, కుటుంబ సభ్యులు ‘ఇక చాలు’ అని కోరినా ఆమె దీక్షను విరమించలేదు. మొత్తానికి నిరుడు భారత ప్రధాని మోదీ రామాలయానికి భూమిపూజ చేసిన తర్వాత.. ఆమె అయోధ్య వెళ్లి, సరయూ నదీ తీరాన తన 28 ఏళ్ల ఉపవాస దీక్షను విరమించారు. 54 ఏళ్ల వయసులో ఆమె నాడు ఆరంభించిన ఆ దీక్ష.. ఎట్టకేలకు ముగియటంతో బాటు రామాలయ ప్రతిష్ఠ కూడా జరగటంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×