E-Paper
Advertisement

జస్ట్ రూ. 21 లక్షల్లోనే టాటా లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు, పోటీ కంపెనీలకు చుక్కలే!

జస్ట్ రూ. 21 లక్షల్లోనే టాటా లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు, పోటీ కంపెనీలకు చుక్కలే!
Advertisement

Tata Intercity EV 2.0 Luxury Electric Bus Launch: టాటా మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ బస్సును డెవలప్ చేస్తోంది. ఇంటర్‌సిటీ EV 2.0 పేరుతో ఆధునిక లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సును తయారు చేస్తోంది. సుదూర ప్రయాణాలకు అనువుగా, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యం, భద్రతను అందించేలా రూపొందిస్తోంది. పర్యావరణానికి హాని తగ్గించేలా ఈ బస్సు పూర్తిగా ఎలక్ట్రిక్ టెక్నాలజీపై పని చేస్తుంది.

ఒకే ఛార్జ్ తో 400 కి.మీ ప్రయాణం

ఈ బస్సులో 450 kWh సామర్థ్యం ఉన్న పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఇది ఇంటర్‌ సిటీ ప్రయాణాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, ఒకే ఛార్జ్‌ తో ఎక్కువ దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ బస్సు ఛార్జింగ్ వ్యవస్థ కూడా వేగంగా పని చేస్తుంది. కేవలం 2 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అయ్యే సామర్థ్యం ఉంది. ట్రావెల్ ఆపరేటర్లకు సమయాన్ని ఆదా చేస్తుంది. ఇక ఈ బస్సు పనితీరును పరిశీలిస్తే..  335 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 864 Nm టార్క్‌ ను అందిస్తుంది. ఈ శక్తివంతమైన పనితీరు వల్ల బస్సు హైవేల్లో సాఫీగా, స్థిరంగా ప్రయాణిస్తుంది. భారీగా బరువు ఉన్నప్పటికీ మంచి వేగం, నియంత్రణను కలిగి ఉంటుంది.

బస్సులో మొత్తం 47 సీట్లు

Advertisement

ఇక ఈ ఎలక్ట్రిక్ బస్సు సీటింగ్ ఏర్పాట్ల విషయానికొస్తే, ఇందులో మొత్తం 47 సీట్లు ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పుష్ బ్యాక్ సీట్లు ఏర్పాటు చేశారు. ప్రతి సీటుకు మొబైల్ హోల్డర్, స్నాక్ ట్రే లాంటి సదుపాయాలు  ఉన్నాయి. దీని వల్ల సుదూర ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా కొనసాగుతాయి.

అత్యాధునిక భద్రతా వ్యవస్థ

భద్రత పరంగా ఈ బస్సులో అత్యాధునిక ADAS 2.0 ఫీచర్లు ఉన్నాయి. సుమారు 20 రకాల సేఫ్టీ అసిస్టెంట్ ఫీచర్లు డ్రైవర్‌ కు అసిస్ట్ చేస్తాయి. డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది డ్రైవర్ అలసటను గుర్తించి హెచ్చరిస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్, స్టెబిలిటీ కంట్రోల్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఇవి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి.

ధర ఎంత అంటే?

Advertisement

ధర విషయానికి వస్తే.. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు సుమారు రూ. 21 లక్షల (ఎక్స్ షోరూమ్)తో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్లతో అందుబాటులో ఉన్న బస్సుల ధరకు ఒక్కోదానికి ఏకంగా రూ. 1 కోటికి పైగా ఉంది. కానీ, టాటా నుంచి అత్యంత చౌకగా ఈ ఎలక్ట్రిక్ బస్సు విడుదల కాబోతోంది. మొత్తంగా టాటా ఇంటర్‌సిటీ EV 2.0 ఆధునిక, పర్యావరణ హితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించే ప్రీమియం ఎలక్ట్రిక్ బస్సుగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. అధునాతన టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరు, ప్రయాణికుల సౌకర్యం కారణంగా భవిష్యత్తు రవాణా రంగంలో ముఖ్యమైన మైలురాయిగా మారనుంది.

Read Also: సీఎన్జీ వాడితే నిజంగా మనీ సేవ్ అవుతుందా? ఇదీ అసలు కథ!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×