E-Paper
Advertisement

ఇండియన్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు మోడల్ ఫిక్స్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

ఇండియన్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు మోడల్ ఫిక్స్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!
Advertisement

భారత ఆటో రంగంలో మరో కీలక మార్పుకు మారుతి సుజుకి శ్రీకారం చుట్టింది. అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి,  ఇండియన్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ఈ నెలలో మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఈ కొత్త మోడల్ వాగన్ ఆర్ ఆధారంగా రూపొందించబడనుంది.

ఇంతకీ ఈ కారు ప్రత్యేకత ఏంటంటే?

Advertisement

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు పెట్రోల్‌ తో పాటు అధిక శాతం ఇథనాల్ కలిగిన ఇంధనంతో కూడా నడిచేలా రూపొందించబడతాయి. కొత్త వాగన్ ఆర్ E85 ఇంధనానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే, ఇందులో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. అయితే, ఇది పూర్తిగా ఇథనాల్‌తో కూడిన E100 ఇంధనంపై కూడా నడుస్తుందా? లేదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహనాల పరీక్షలు, ధృవీకరణ ప్రమాణాల్లో E100 ఇంధనాన్ని చేర్చింది. భవిష్యత్తులో పూర్తిగా ఇథనాల్‌ తో నడిచే వాహనాల తయారీకి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలోనే మారుతి సుజుకి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేసే సాంకేతిక సామర్థ్యం తమ కంపెనీకి ఉందని మారుతి సుజుకి కార్పొరేట్ వ్యవహారాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి  తెలిపారు. ప్రభుత్వం అవసరాన్ని బట్టి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇథనాల్ ఇంధన పంపిణీ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం సవాల్‌ గా మారింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వినియోగం పెరగాలంటే మరిన్ని మోడళ్లు మార్కెట్లోకి రావడంతో పాటు, ఇథనాల్, పెట్రోల్ ధరల మధ్య సరైన సమతుల్యత ఉండాలని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ..

Advertisement

సాధారణ కార్లతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల తయారీ ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుంది. ఒక్కో వాహనంపై సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అదనపు వ్యయం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు భారత్ మొబిలిటీ ఎక్స్‌ పోలో పలు కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల మోడల్స్ ను ప్రదర్శించినప్పటికీ, కమర్షియల్ గా ఏ మోడల్ కూడా అందుబాటులోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో మారుతి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ విడుదలైతే దేశంలో ఈ విభాగంలో తొలి అడుగుగా నిలవనుంది.

ఇక ప్రభుత్వం కూడా ప్రస్తుతం అమలులో ఉన్న E20 ప్రమాణాన్ని మరింత పెంచే దిశగా ఆలోచిస్తోంది. భవిష్యత్తులో E21, E22, E25 స్థాయిల వరకు ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశంలోని కోట్లాది వాహనదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కీలక మైలురాయిగా మారే అవకాశం కనిపిస్తోంది.

Read Also: ఈ కారును రెండేళ్లు వాడుకొని వెనక్కి ఇచ్చేయొచ్చు, ఇదీ కదా అదిరిపోయే ఆఫర్ అంటే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×