E-Paper
Advertisement

మారుతీ సుజుకి కీలక నిర్ణయం.. మార్కెట్లోకి చిన్నకారు ‘ఇగ్నిస్’ రానట్టే, కొత్త బుకింగ్‌ తీసుకోని డీలర్లు

మారుతీ సుజుకి కీలక నిర్ణయం.. మార్కెట్లోకి చిన్నకారు ‘ఇగ్నిస్’ రానట్టే, కొత్త బుకింగ్‌ తీసుకోని డీలర్లు
Advertisement

Ignis Car: దేశీయ ఆటోమొబైల్ సెక్టార్‌లో మారుతీ సుజుకి కూడా ఒకటి. అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం కూడా. తాజాగా బడ్జెట్ కారు ఇగ్నిస్ ఉత్పత్తిని నిలిపేసినట్టు వార్తలు వస్తున్నాయి. పంచ్ లాంటి మైక్రో ఎస్‌యూవీల తయారీపై ఆ కంపెనీ ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఉన్నట్లుంది ఇగ్నిస్ ఉత్పత్తి క్లోజ్ చేయడం వెనుక అసలేం జరిగింది?

మారుతీ సుజుకి కీలక నిర్ణయం

Advertisement

భారతదేశంలో మారుతి సుజికి కంపెనీ చిన్నకారు ఇగ్నిస్ ఉత్పత్తిని నిలిపి వేసినట్లు సమాచారం. మార్కెట్ డీలర్ వర్గాలను ఉటంకిస్తూ కార్టోక్ ఈ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ఇగ్నిస్ కార్ల ఉత్పత్తి నెల రోజులకు పైగా నిలిచిపోయింది. ఈ మోడల్ బుకింగ్‌లు కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది. మారుతి వెబ్‌సైట్‌లో ఇగ్నిస్ బుకింగ్‌లకు సంబంధించి ఎలాంటి సమాచారం కనిపించలేదు.

వస్తున్న ఈ వార్తలపై ఆ కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 2017లో ప్రారంభించబడిన ఈ ప్రీమియం అర్బన్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఇగ్నిస్. మధ్యతరగతిని విపరీతంగా ఆకట్టుకున్న కార్లలో ఇది కూడా ఒకటి. ధర కేవలం రూ. 4.59 లక్షల నుండి రూ.7.80 లక్షల మధ్య ఉండేది. అయితే నగరాల బట్టి ధరల్లో మార్పులు ఉండేవి.

Advertisement

ఆగిన చిన్నకారు ‘ఇగ్నిస్’ ఉత్పత్తి.. కొత్తవాటిపై దృష్టి

ఇగ్నిస్ కారును పట్టణ-మధ్య తరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఉండేది. ఇందులో ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ టెక్నాలజీ కూడా ఉంది. జీఎస్టీ తగ్గింపు తర్వాత కారు ధర రూ. 71 వేల వరకు తగ్గింది. అయినప్పటికీ అమ్మకాల్లో ఎలాంటి జోరు కనిపించలేదు. గతేడాది ఈ నెలలో 3,780 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకాలు దాదాపు 50 శాతం తగ్గిపోయింది.

చివరకు 1,902 యూనిట్లకు పడిపోయంది. ఫలితంగా వినియోగదారులు ఆ కార్లపై చూడలేదని ఆ కంపెనీ భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో చిన్న కార్ల సెగ్మెంట్లో టాటా పంచ్, హ్యూండాయ్ ఎక్స్‌టర్ మోడళ్లు ఉన్నాయి. వాటికి పోటీగా మైక్రో ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజికి కొత్త మోడల్‌ను విడుదల చేయవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్.. ఈ మినహాయింపులు మర్చిపోకండి!

మరోవైపు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ గతేడాది మార్చి 2025లో 1,92,984 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది మార్చి నాటికి 16.72 శాతం పెరిగి 2,25,251 యూనిట్లు చేరినట్టు తెలుస్తోంది. దేశీయంగా వాహనాల అమ్మకాలు 1,66,219 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే 10.27 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×